పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-675-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లజలోచను కడకు నుత్కలికతోడఁ
నరు శిబికల నెక్కి నంనులుఁ దాముఁ
నఁగ నేతేరఁ బ్రతిహారనులు వేత్ర
లితులై పౌరులను నెడలుగ జడియ.

టీకా:

జలజలోచను = కృష్ణుని; కడ = వద్ద; కున్ = కు; ఉత్కలిక = ఉత్కంఠము; తోడన్ = తోటి; తనరు = చక్కటి; శిబికలున్ = పల్లకీలు; ఎక్కి = ఎక్కి; నందనులున్ = కొడుకులు; తాము = వారు; కనగన్ = చూచుటకు; ఏతేరన్ = రాగా; ప్రతిహార = ద్వారపాలకుల; జనులు = సమూహము; వేత్ర = బెత్తములు; కలితులు = కలవారు; ఐ = అయ్యి; పౌరులను = ప్రజలను; ఎడన్ = ఎడము, చోటు; కలుగన్ = కలుగునట్లుగా; జడియన్ = తొలగునట్లు.

భావము:

ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు.