దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు
- ఉపకరణాలు:
జలజలోచను కడకు నుత్కలికతోడఁ
దనరు శిబికల నెక్కి నందనులుఁ దాముఁ
గనఁగ నేతేరఁ బ్రతిహారజనులు వేత్ర
కలితులై పౌరులను నెడగలుగ జడియ.
టీకా:
జలజలోచను = కృష్ణుని; కడ = వద్ద; కున్ = కు; ఉత్కలిక = ఉత్కంఠము; తోడన్ = తోటి; తనరు = చక్కటి; శిబికలున్ = పల్లకీలు; ఎక్కి = ఎక్కి; నందనులున్ = కొడుకులు; తాము = వారు; కనగన్ = చూచుటకు; ఏతేరన్ = రాగా; ప్రతిహార = ద్వారపాలకుల; జనులు = సమూహము; వేత్ర = బెత్తములు; కలితులు = కలవారు; ఐ = అయ్యి; పౌరులను = ప్రజలను; ఎడన్ = ఎడము, చోటు; కలుగన్ = కలుగునట్లుగా; జడియన్ = తొలగునట్లు.
భావము:
ఇలాగ, అంతఃపురకాంతలు పల్లకీలు ఎక్కి తమ సంతానంతో రాగా కావలివారు పౌరులను బెత్తాలతో ప్రక్కలకు ఒత్తిగించారు.