పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : ధర్మజు రాజసూ యారంభంబు

  •  
  •  
  •  

10.2-671-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వంది మాగధ సూత కైవారరవము
సుమతీసురకోటి దీనల మ్రోఁత
నుగమింపంగ సతులు సౌధాగ్రశిఖర
జాలములనుండి ముత్యాలశాస లొలుక.

టీకా:

వంది = స్తుతిపాఠకుల; మాగధ = వంశావళి చదువువారి; సూత = భట్రాజుల; కైవార = స్తోత్రముల యొక్క; రవము = ధ్వని; వసుమతీసుర = విప్రుల; కోటి = సమూహము; దీవనల = ఆశీర్వచనముల; మ్రోతలను = ధ్వనులను; అనుగమింపన్ = కలిసిపోతుండగా; సతులు = స్త్రీలు; సౌధ = భవనముల; అగ్ర = మీది; శిఖర = పై; జాలముల = కిటికీల; నుండి = నుండి; ముత్యాల = ముత్యాల; శాసలు = తలంబ్రాలు; ఒలుకన్ = చల్లుచుండగా.

భావము:

వందిమాగధుల, సూతజనుల పొగడ్తలూ; బ్రాహ్మణుల ఆశీర్వాదాలూ అతిశయిస్తుండగా; పుర స్త్రీలు మేడలమీద నుంచి ముత్యాల అక్షతలు చల్లుతుండగా; శ్రీకృష్ణుడు ముందుకు సాగాడు.