పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భూసురుని దౌత్యంబు

  •  
  •  
  •  

10.2-644-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వధరింపు; జరాసంధుఁ తుల బలుఁడు
నకు మ్రొక్కని ధారుణీవుల నెల్ల
వెదకి తెప్పించి యిరువదివేల నాఁకఁ
బెట్టినాఁడు గిరివ్రజట్టణమున.

టీకా:

అవధరింపుము = వినుము; జరాసంధుడు = జరాసంధుడు; అతుల = సాటిలేని; బలుడు = బలములు కలవాడు; తన = అతని; కు = కి; మ్రొక్కని = లొంగని; ధారుణీధవులన్ = రాజులను; ఎల్లన్ = అందరిని; వెదకి = వెతికి; తెప్పించి = తీసుకువచ్చి; ఇరువదివేల = ఇరవైవేలమందిని (20000); ఆకపెట్టినాడు = చెఱబట్టినాడు; గిరివ్రజ = గిరివ్రజము అను; పట్టణమునన్ = పట్టణము నందు.

భావము:

దయచేసి నా విన్నపములు వినుము. అతి బలవంతుడైన జరాసంధుడు తనకు లోబడి ఉండని రాజులను అందరినీ వెదకి వెదకి తెప్పించి మరీ తన రాజధాని గిరివ్రజపురంలో కారాగారాలలో బంధించాడు. అలా ఇప్పటికి ఇరవైవేల మంది వరకూ రాజులు బంధీలుగా ఉన్నారు.