పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భూసురుని దౌత్యంబు

  •  
  •  
  •  

10.2-642-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇవ్విధంబునం బ్రతిదివసంబును నుండు నవసరంబున నొక్కనా డపూర్వదర్శనుం డైన భూసురుం డొక్కరుండు సనుదెంచి సభా మధ్యంబునం గొలువున్న ముకుందునిం బొడగని దండప్రణామం బాచరించి వినయంబునఁ గరములు మొగిచి యిట్లనియె.

టీకా:

ఈ = ఈ; విధంబునన్ = విధముగా; ప్రతి = అన్ని; దివసంబునున్ = దినము నందు; ఉండు = ఉంటున్న; అవసరంబునన్ = సమయము నందు; ఒక్క = ఒకానొక; నాడు = దినమున; అపూర్వదర్శనుండు = ముందెన్నడు కనబడనివాడు; ఐన = అగు; భూసురుండు = విప్రుడు; ఒక్కరుండు = ఒకడు; చనుదెంచి = వచ్చి; సభా = కొలువుకూటము; మధ్యంబునన్ = నడుమ; కొలువున్న = సభతీరి ఉన్నట్టి; ముకుందునిన్ = కృష్ణుని; పొడగని = చూసి; దండప్రణామంబులు = సాగిలపడి మొక్కుటలు; ఆచరించి = చేసి; వినయంబునన్ = వినయముతో; కరములున్ = చేతులు; మొగిచి = జోడించి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

వాసుదేవుడు ఇలా సంతోషంగా రోజులు గడుపుతుండగా, ఒకనాడు కొత్త బ్రాహ్మణుడు ఒకడు వచ్చి సభామధ్యంలో కొలువుతీరి ఉన్న శ్రీకృష్ణుడిని దర్శించాడు. నమస్కారం చేసి, వినయంగా చేతులు జోడించి ఇలా అన్నాడు.