పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : షోడశసహస్ర స్త్రీ సంగతంబు

  •  
  •  
  •  

10.2-633-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని తద్వచనసుధాసే
మున ముది తాత్ముఁ డగుచు సంయమి చిత్తం
బునఁ దన్మూర్తిం దగ నిడు
కొని చనియెను హరినుతైకకోవిదుఁ డగుచున్.

టీకా:

అని = అని; తత్ = ఆ కృష్ణుని; వచన = మాటలు అను; సుధా = అమృతమును; సేచనమునన్ = తడయుటచేత; ముదిత = సంతోషించిన; ఆత్ముడు = మనస్సు కలవాడు; అగుచున్ = ఔతు; సంయమి = ఋషి, నారదుడు {సంయమి - సంయమము కలవాడు, ఋషి}; చిత్తంబునన్ = మనస్సు నందు; తత్ = అతని; మూర్తిన్ = రూపమును; తగన్ = చక్కగా; ఇడుకొని = ఉంచుకొని; చనియెను = వెళ్ళిపోయెను; హరి = విష్ణు; నుత = కీర్తనలు చేయు టందు; ఏక = ప్రధానమైన; కోవిదుడు = విద్వాంసుడు; అగుచున్ = ఔతు.

భావము:

ఇలా పలికి, నారదుడు వాసుదేవ వాగామృతధారలలో మునిగి సంతుష్టాంతరంగుడు, విష్ణు కీర్తనలు వాడుటలో అమిత నేర్పరి అయి, ఆ మంగళమయ స్వరూపాన్ని తన మనసులో నిలుపుకుని వెళ్ళిపోయాడు.