పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : షోడశసహస్ర స్త్రీ సంగతంబు

  •  
  •  
  •  

10.2-629-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రమభాగవతుఁడు రమేష్ఠితనయుండు
నుజలీలఁ జెంది హితసౌఖ్య
చిత్తుఁడైన యా హృషీకేశు యోగమా
యాప్రభావమునకు నాత్మ నలరి.

టీకా:

పరమ = అత్యుత్తమమైన; భాగవతుడు = భాగవతధర్మానుష్ఠానుని; పరమేష్ఠితనయుండు = నారదుడు {పరమేష్ఠి తనయుడు - బ్రహ్మపుత్రుడు, నారదుడు}; మనుజ = సామాన్య మానవుని; లీలన్ = విధమును; చెంది = పొంది; మహిత = గొప్ప; సౌఖ్య = సుఖముల తగిలిన; చిత్తుడు = మనస్సు కలవాడు; ఐన = అయిన; ఆ = ఆ; హృషీకేశున్ = కృష్ణుని యొక్క {హృషీకేశుడు - హృషీకములు (సర్వేంద్రియములను) ఈశుడు (వర్తింప చేయువాడు), విష్ణువు}; యోగ = యోగశక్తి యొక్క; మాయా = మహిమల; ప్రభావమున్ = వైభవముల; కున్ = కు; ఆత్మన్ = మనస్సు నందు; అలరి = సంతోషించి.

భావము:

పరమ భాగవతోత్తముడు, బ్రహ్మ మానసపుత్రుడు అయిన నారదుడు మానవ రూపుడు అయి సామాన్య మానువుని వలె భౌతిక సౌఖ్యాలలో తేలియాడుతున్న ఆ సర్వేంద్రియములకు ఈశ్వరుడు అయిన శ్రీకృష్ణభగవానుడి యోగమాయా ప్రభావాన్ని పరీక్షించి చూసి చాలా సంతోషించి.....