పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నారదుని ద్వార కాగమనంబు

  •  
  •  
  •  

10.2-608-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు బ్రహ్మణ్యదేవుండును నరసఖుండునైన నారాయణుం డశేష తీర్థోపమానంబయిన మునీంద్రపాద తీర్థంబు ధరించినవాఁడయి, సుధాసారంబులైన మితభాషణంబుల నారదున కిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; బ్రహ్మణ్య = వేదోక్తధర్మము నడపునట్టి; దేవుండును = భగవంతుడు; నర = అర్జునునకు; సఖుండునున్ = స్నేహితుడు; ఐన = అయినట్టి; నారాయణుండు = కృష్ణుడు; అశేష = లెక్కలేనన్ని; తీర్థ = పుణ్యతీర్థములకు; ఉపానంబులు = సరిపోలునవి; అయిన = అగు; ముని = ఋషి; ఇంద్ర = ఉత్తముని; పాద = పాదము లందలి; తీర్థంబున్ = జలమును; ధరించినవాడు = ధరించినవాడు; అయి = అయ్యి; సుధా = అమృతము; సారంబులు = వంటివి; ఐన = అయినట్టి; మితి = తక్కువైన; భాషణంబులన్ = మాటలతో; నారదున్ = నారదముని; కిన్ = కి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అలా దేవదేవుడూ, అర్జునుడి చెలికాడూ, నారాయణుడూ అయిన నల్లనయ్య సమస్త పుణ్యతీర్ధాలకూ సాటివచ్చే నారదమునీంద్రుడి పాదజలాన్ని తన తలపై ధరించి, అమృతం చిలికే పలుకులతో ఇలా అన్నాడు.