పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నారదుని ద్వార కాగమనంబు

  •  
  •  
  •  

10.2-598-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"వర! యొక్కనాఁడు విను నారదసంయమి మాధవుండు దా
కునిఁ ద్రుంచి వాని భవనంబున నున్న పదాఱువేల సుం
రులను నొక్కమాటు ప్రమదంబున నందఱ కన్నిరూపులై
రిణయ మయ్యె నా విని శుస్థితిఁ దద్విభవంబుఁ జూడఁగన్.

టీకా:

నరవర = రాజా; ఒక్క = ఒకానొక; నాడు = రోజు; విను = వినుము; నారద = నారద; సంయమి = ముని {సంయమి - సంయమనము కలవాడు, యోగి}; మాధవుండు = కృష్ణుడు; తాన్ = తను; నరకుని = నరకాసురుని; త్రుంచి = చంపి; వాని = అతని యొక్క; భవనంబునన్ = ఇంటిలో; ఉన్న = ఉన్నట్టి; పదాఱువేల = పదహారువేల (16000); సుందరులన్ = అందగత్తెలను; ఒక్క = ఒకే; మాటు = సారి; ప్రమదంబునన్ = సంతోషంగా; అందఱ = అందరి; కున్ = కి; అన్ని = అన్ని; రూపులు = స్వరూపములు కలవాడు; ఐ = అయ్యి; పరిణయము = వివాహము; అయ్యెన్ = అయ్యెను; నాన్ = అనగా; విని = విని; శుభ = శోభనకరమైన; స్థితిన్ = రీతిలో; తత్ = ఆ యొక్క; విభవంబున్ = వైభవమును; చూడగన్ = చూడవలెనని.

భావము:

“ఓ రాజశేఖరా! విను. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపి, అతని మందిరంలో ఉన్న పదహారువేల మంది అందగత్తెలనూ వరించి, ఒకేమారు అందరికీ అన్ని రూపాలతో కనపడుతూ వివాహం చేసుకున్నాడు అనే వార్త నారదుడు విన్నాడు. ఒకనాడు ఆ కృష్ణవైభవం దర్శించాలనే కాంక్షతో ద్వారకకు వచ్చాడు. అప్పుడు....