పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలుడు నాగనగరం బేగుట

  •  
  •  
  •  

10.2-575-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"మా రనాథునాజ్ఞ నిజస్తములన్ ధరియించి కౌరవుల్‌
మానుగఁజేయు టొప్పగుఁ; గుమారకునొక్కనిఁ బెక్కుయూథపుల్‌
పూనిన లావుమై నెదిరి పోర జయించుట మీఁదితప్పు; త
ప్పైను గాచె బాంధవహితాత్మకుఁడై మనుజాధినాథుఁడున్."

టీకా:

మా = మా యొక్క; నరనాథున్ = ఉగ్రసేన రాజు; ఆజ్ఞన్ = ఉత్తరువును; నిజ మస్తములన్‌ ధరియించి = శిరసావహించి; కౌరవుల్ = కురువంశస్థులు; మానుగన్ = చక్కగా; చేయుట = నడచుట; ఒప్పు = సరియైనది; అగున్ = ఐ ఉండును; కుమారకుని = చిన్నపిల్లవానిని; ఒక్కనిన్ = ఒక్కడిని; పెక్కు = అనేకులైన; యూథపుల్ = సేనానాయకులు,; పూనినన్ = కూడగట్టుకొన్న; లావుమైన్ = బలములతో; ఎదిరి = తాకి, ఎదిరించి; పోరన్ = యుద్ధముచేసి; జయించుట = గెలుచుట; మీది = మీ యొక్క; తప్పు = నేరము; తప్పు = నేరము; ఐననున్ = అయినప్పటికి; కాచెన్ = మన్నించెను; బాంధవ = బంధువుల యెడ; హిత = మేలుకోరు; ఆత్మకుడు = మనస్సుకలవాడు; ఐ = అయ్యి; మనుజాధినాథుడున్ = మహారాజు.

భావము:

“మా రాజైన ఉగ్రసేనుడి ఆజ్ఞను మీరు మన్నించవలెను. ఇంతమంది సేనాధిపతులు ఒక్కటై పిల్లవాడిని ఒక్కడిని చేసి బంధించడం తప్పు. అయినా మా రాజు బంధువుల క్షేమం కోరి, మీరు చేసిన తప్పును మన్నించాడు.”