పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాంబుడు లక్షణ నెత్తకు వచ్చుట

  •  
  •  
  •  

10.2-566-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వా లనేకు లయ్యు బలవంతులునయ్యు మహోగ్రసంగ రో
దాపరాక్రమప్రకటక్షులునయ్యుఁ గుమారకున్ జగ
ద్వీరుని నొక్కనిం జెనకి వ్రేలును వంపఁగలేక సిగ్గునం
గూరినచింత నొండొరులఁ గూడుచు విచ్చుచు వెచ్చనూర్పుచున్.

టీకా:

వారలు = వారు; అనేకులు = చాలామంది; అయ్యున్ = ఐ ఉన్నను; బలవంతులు = బలము కలవారు; అయ్యున్ = అయినప్పటికి; మహా = మిక్కిలి; ఉగ్ర = భీకరమైన; సంగర = యుద్ధమునందు; ఉదార = విస్తారమైన; పరాక్రమ = విక్రమము; ప్రకట = చూపుటంబు; దక్షులున్ = సమర్థులు; అయ్యున్ = అయినప్పటికి; కుమారకున్ = బాలుని; జగత్ = లోక; వీరుని = వీరుడిని; ఒక్కనిన్ = ఒక్కడిని; చెనకి = తాకి, ఎదిరించి; వ్రేలునున్ = వేలును కూడ; వంపగలేక = వంచలేక; సిగ్గునన్ = లజ్జతో; కూరిన = పొందిన; చింతన్ = విచారముతో; కూడుచున్ = కలిసికొనుచు; విచ్చుచున్ = విడిపోతూ; వెచ్చనూర్చుచున్ = నిట్టూరుస్తు.

భావము:

కౌరవుల అధిక బలవంతులూ, యుద్ధవిశారదులూ అయిన అంతమంది ఉన్నప్పటికీ, మహావీరుడు సాంబుడు ఒక్కడితో తలపడి అతని వ్రేలు కూడ వంచలేకపోయారు. దానితో, వారు సిగ్గుపడి అవమాన భారంతో చాలా బాధపడ్డారు. నిట్టూర్పులు విడిచారు.