పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : సాంబుడు లక్షణ నెత్తకు వచ్చుట

  •  
  •  
  •  

10.2-562-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చండ కోదండ ముక్త నిశాత విశిఖ
జా మందంద వఱపి యాభీముగను
నందనందన నందన స్యందనంబు
ముంచి రచలేంద్రమును ముంచు మంచు పగిది.

టీకా:

చండ = తీవ్రమైన; కోదండ = ధనుస్సునుండి; ముక్త = విడువబడిన; నిశాత = వాడియైన; విశిఖ = బాణముల యొక్క; జాలమున్ = సమూహమును; అందంద = ఒకదానిమీదొకటి; పఱపి = ప్రయోగించి; ఆభీలముగను = భయంకరముగ; నందనందననందన = సాంబుని {నందనందననందనుడు - నందుని కొడుకు యొక్క (కృష్ణుని) కొడుకు, సాంబుడు}; స్యందనంబున్ = రథమును; ముంచిరి = మునుగునట్లు చేసిరి; అచల = పర్వత; ఇంద్రమును = శ్రేష్ఠమును; ముంచు = ముంచివేసెడి; మంచు = మంచుతెర; పగిదిన్ = వలె.

భావము:

కౌరవులు ధనుస్సులు ఎక్కుపెట్టి సాంబుడి మీద వాడి బాణాలను ప్రయోగించి, మంచు పర్వతాన్ని ముంచివేసినట్లు అతడి రథాన్ని బాణాలతో కప్పివేశారు.