పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కాశీరాజు వధ

  •  
  •  
  •  

10.2-531-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిన శంకరుఁ డతనికి నియె "ననఘ!
నీవు ఋత్విజులును భూసురాళియునుఁ
బ్రీతి నభిచార మొనరింప భూయుక్తుఁ
గుచు ననలుండు దీర్చు నీ భిమతంబు. "

టీకా:

అనినన్ = అనగా; శంకరుడు = శివుడు; అతని = అతని; కిన్ = కి; అనియెన్ = చెప్పెను; అనఘ = పాపరహితుడా; నీవు = నీవు; ఋత్విజులును = యజ్ఞము చేయించువారు; భూసుర = విప్రులు; ఆవళియునున్ = సమూహములు; ప్రీతిన్ = ఇష్టపూర్వకముగా; అభిచార = మారణహోమమును {అభిచారము - శత్రునాశనమునకైన హోమము, మారణహోమము}; ఒనరింపన్ = చేయగా; భూత = భూతములతో; యుక్తుడు = కూడినవాడు; అగుచున్ = ఔతు; అనలుండు = అగ్నిదేవుడు; తీర్చున్ = నెరవేర్చును; నీ = నీ యొక్క; అభిమతమున్ = కోరికను, ఇచ్ఛను.

భావము:

అప్పుడు పరమశివుడు అతడితో ఇలా అన్నాడు “అనఘా! నీవూ ఋత్విజులూ బ్రాహ్మణశ్రేష్ఠులూ ప్రీతితో అభిచారహోమం చేస్తే, భూతములతో కూడి, అగ్నిదేవుడు నీ కోరిక నెరవేరుస్తాడు.”