పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కాశీరాజు వధ

  •  
  •  
  •  

10.2-524-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వక కాశికావిభుని స్తక ముద్ధతిఁ ద్రుంచి బంతి కై
డి నది పింజ పింజ గఱవన్ విశిఖాళి నిగుడ్చి వాని యే
లెడి పురిలోన వైచె నవలీల మురాంతకుఁ డిట్లు వైరులం
డఁగి జయించి చిత్తమునఁ గౌతుకముం జిగురొత్త నత్తఱిన్.

టీకా:

మడవక = వెనుదీయక; కాశికా = కాశీపట్టణపు; విభుని = రాజు యొక్క; మస్తకమున్ = తలను; ఉద్ధతిన్ = అతిశయముతో; త్రుంచి = తెగనరికి; బంతి = బంతి; కైవడిన్ = వలె; అది = దానిని; పింజపింజగఱవన్ = ఒకటి వెను కొకటి చొప్పున; విశిఖ = బాణములు; ఆళిన్ = పరంపరను; నిగుడ్చి = వేసి; వాని = అతను; ఏలెడి = పాలించెడి; పురి = పట్టణము; లోనన్ = అందు; వైచె = వేసెను; లీలన్ = విలాసముగా; మురాంతకుడు = కృష్ణుడు; ఇట్లు = ఇలా; వైరులన్ = శత్రువులను; కడగి = పూని; జయించి = గెలిచి; చిత్తమునన్ = మనసు నందు; కౌతుకము = కుతూహలము; చిగురొత్తన్ = కలుగగా; ఆ = ఆ; తఱిన్ = సమయము నందు.

భావము:

అటుపిమ్మట, కాశీరాజు శిరస్సును కూడా శ్రీకృష్ణుడు ఖండించి, ఆ శిరస్సును బంతిలాగ వరుస బాణాలతో పైపైకి ఎగురకొట్టి అతని పట్టణంలో పడేలా కొట్టాడు. ఈ విధంగా మురాంతకుడు శత్రువులను జయించి మనస్సులో ఎంతో ఉత్సాహం ఉప్పొంగగా ఆనందించాడు. అప్పుడు....