పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పౌండ్రకవాసుదేవుని వధ

  •  
  •  
  •  

10.2-514-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని యుద్రేకముగా నా
డి మాటల కులికి వాఁడు డెందము గలఁగం
ని తన యేలిక కంతయు
వినిపించెను నతని మదికి విరసము గదురన్.

టీకా:

అని = అని; ఉద్రేకముగా = ఉద్రేకముతో; ఆడిన = పలికిన; మాటలు = మాటలు; కిన్ = కి; ఉలికి = ఖంగారుపడి; వాడున్ = ఆ దూత; డెందము = హృదయము; కలగన్ = కలతచెందగా; చని = వెళ్ళి; తన = తన యొక్క; ఏలిక = రాజున; కున్ = కు; అంతయున్ = సమస్తము; వినిపించెను = తెలియజెప్పెను; అతని = వాని; మది = మనస్సున; కిన్ = కు; విరసము = ద్వేషము; కదురన్ = కలుగగా.

భావము:

ఈ విధంగా ఉద్రేకంగా పలికిన శ్రీకృష్ణుడి పలుకులకు వాడు ఉలికిపడి గుండెజారిపోయి, తన ప్రభువు దగ్గరకు వెళ్ళి, జరిగిన దంతా అతని మనస్సుకు ఆందోళన కలిగేలా విన్నవించాడు.