పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పౌండ్రకవాసుదేవుని వధ

  •  
  •  
  •  

10.2-513-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"విరా! మీ నృపుఁ డన్న చిహ్నములు నే వే వచ్చి ఘోరాజిలో
మీఁదన్ వెస వైవఁ గంకముఖగృధ్రవ్రాతముల్‌ మూఁగఁగా,
నిలో దర్పము దూలి కూలి వికలంబై సారమేయాళికి
న్నయంబున్ నశనంబ వయ్యె దను మే న్నట్లుగా వానితోన్. "

టీకా:

వినరా = వినుము; మీ = మీ యొక్క; నృపుడు = రాజు; అన్న = చెప్పిన; చిహ్నములున్ = గురుతులను; నేన్ = నేను; వే = శీఘ్రముగా; వచ్చి = వచ్చి; ఘోర = భయంకరమైన; ఆజి = యుద్ధము; లోన్ = అందు; తన = మీ రాజు; మీదన్ = పైన; వెసన్ = వడిగా; వైవన్ = వేయగా; కంక = రాబందు; ముఖ = మొదలగునవి; గృధ = గ్రద్దల; వ్రాతముల్ = గుంపులు; మూగగాన్ = ఆవరించగా; అని = యుద్ధము; లోన్ = అందు; దర్పము = అహంకారము; తూలి = పోయి; కూలి = పడిపోయి; వికలంబు = సంధులు వీడిపోయి; సారమేయ = కుక్కల; ఆళి = సమూహమున; కిన్ = కు; అనయంబున్ = అవశ్యము; అశనంబు = ఆహరము; అయ్యెదు = అయిపోయెదవు; అనుము = అని చెప్పుము; ఏను = నేను; అన్నట్లుగాన్ = చెప్పినట్లుగా; వాని = అతడి; తోన్ = తోటి.

భావము:

“ఓరీ! సరిగా విను. మీ రాజు ఏ చిహ్నాలను ధరించాను అని నన్ను గురించి చెప్పాడో; అవే చిహ్నాలను రేపు బయలుదేరి వచ్చి తొందరలోనే ఘోరయుద్ధంలో అతని మీద ప్రయోగిస్తాను. యుద్ధంలో శక్తి కోల్పోయి కూలి వికలం అయిపోయిన నిన్ను గ్రద్దలూ రాబందులూ చుట్టుముట్టుతా యని; కుక్కల గుంపులు నిన్ను చీల్చుకొని తింటా యనీ; మేము చెప్పినట్లుగా అతనికి చెప్పు.”