పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కాళిందీ భేదనంబు

  •  
  •  
  •  

10.2-507-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత బలభద్రుండు వ్రజసుందరీ సమేతుండై నందఘోషంబునం బరితోషంబు నొందుచుండె, నంత నక్కడఁ గరూశాధిపతి యైన పౌండ్రకుండు తన దూతం బిలిచి యిట్లనియె.

టీకా:

అంతన్ = అంతట; బలభద్రుండు = బలరాముడు; వ్రజ = గోపికా; సుందరీ = స్త్రీలతో; సమేతుండు = కూడి యున్నవాడు; ఐ = అయ్యి; నంద = నందుని; ఘోషంబునన్ = మందలో; పరితోషంబున్ = సంతోషమును; ఒందుచున్ = పొందుతు; ఉండెన్ = ఉండెను; అక్కడ = కరూశ దేశమున; కరూశా = కరూశదేశపు; అధిపతి = రాజు; ఐన = అయిన; పౌండ్రకుండు = పౌండ్రకుడు; తన = తన యొక్క; దూతన్ = దూతను; పిలిచి = పిలిచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

బలరాముడు ఈలా గోపాంగనలతో ఆనందిస్తూ ఉండగా, కరూశదేశపురాజు పౌండ్రకుడు తన దూతను పిలిచి ఇలా అన్నాడు.