పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని ఘోషయాత్ర

  •  
  •  
  •  

10.2-494-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంత బలభద్రుండు వారల మనంబుల సంతాపంబులు వారింప నుపాయంబు లగు సరసచతురవచనంబులఁ గృష్ణుని సందేశంబులు సెప్పి విగతఖేదలం జేసి యచ్చట మాసద్వయంబు నిలిచి వసంతవాసరంబులు గడపుచుఁ గాళిందీ తీరంబున.

టీకా:

అంతన్ = అంతట; బలభద్రుండు = బలరాముడు; వారల = వారి; మనంబులన్ = మనస్సులలోని; సంతాపంబులున్ = దుఃఖములను; వారింపన్ = తొలగించు; ఉపాయంబులు = ఉపాయములు; అగు = ఐన; సరస = సరసపు; చతుర = ఛలోక్తుల; వచనంబులన్ = మాటలతో; కృష్ణుని = కృష్ణుని; సందేశంబులున్ = చెప్పి పంపిన మాటలు; చెప్పి = చెప్పి; విగత = తొలగిన; ఖేదలన్ = దుఃఖము కలవారిని; చేసి = చేసి; అచ్చటన్ = అక్కడ; మాస = నెలలు; ద్వయంబున్ = రెండు (2); నిలిచి = ఆగి; వసంత = వసంతత కాలపు; వాసరంబులున్ = రోజులు; గడపుచున్ = వెళ్ళబుచ్చచు; కాళిందీ = యమునానది యొక్క; తీరంబునన్ = తీరము నందు.

భావము:

అప్పుడు బలరాముడు వారి సంతాపాలు తొలగిపోయేలాగ మంచి మాటలు చెప్పి, శ్రీకృష్ణుడి సందేశం వినిపించి, వారి దుఃఖాన్ని తొలగించాడు. అలా వ్రేపల్లె లో రెండు నెలలపాటు ఉన్నాడు. ఒకనాడు కాళిందీతీరానికి వెళ్ళాడు.