పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బలరాముని ఘోషయాత్ర

  •  
  •  
  •  

10.2-489-కవి.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని బలభద్రుని శౌర్య సముద్రుని; సంచితపుణ్యు నణ్యునిఁ జం
ఘనసార పటీర తుషారసు; ధా రుచికాయు విధేయు సుధా
రిపుఖండను న్మణిమండను; సారవివేకు నశోకు మహా
త్మునిఁ గని గోపిక లోపిక లేక య; దుప్రభు నిట్లని రుత్కలికన్.

టీకా:

చని = పోయి; బలభద్రుని = బలరాముని; శౌర్య = పరాక్రమము; సముద్రుని = సముద్ర మంత కలవానిని; సంచిత = కూడగట్టుకొనిన; పుణ్యున్ = పుణ్యము కలవానిని; అగణ్యునిన్ = ఎంచ శక్యము కానివానిని; చందన = గంధము; ఘనసార = కర్పూరము; పటీర = మంచిగంధము పూత; తుషార = మంచు; సుధా = అమృతము వంటి; రుచి = వర్ణము కల; కాయున్ = దేహము కలవానిని; విధేయున్ = వినయము కలవానిని; సుధాశనరిపుఖండను = బలరాముని {సుధాశన రిపు ఖండనుడు - సుధాశన (అమృతము ఆహారముగా గల, దేవతల) రిపు (శత్రువులను) ఖండనుడు (సంహరించిన వాడు), బలరాముడు}; సత్ = మంచి; మణి = రత్నాలచే; మండనున్ = అలంకరింపబడినవాని; సార = మిక్కిలి; వివేకున్ = వివేకము కలవానిని; అశోకున్ = నిత్యానందు డైన వానిని; మహాత్మునిన్ = గొప్పవానిని; కని = చూసి; గోపికలు = గొల్లభామలు; ఓపిక = తాలిమి; లేక = లేక; యదు = యాదవ; ప్రభున్ = రాజుతో; ఇట్లు = ఈ విధముగ; అనిరి = చెప్పిరి; ఉత్కలికన్ = తమకములతో.

భావము:

అలా వచ్చి, శౌర్య సముద్ఱ్ఱుడూ, చందనం వలె కర్పూరం వలె, మంచు వలె, అమృతం వలె, తెల్లని కాంతితో విలసిల్లుతున్నవాడూ, రాక్షసాంతకుడూ, వివేకవంతుడూ అయిన ఆ యాదవశ్రేష్ఠుడు బలరాముడిని చూసి, ఆపుకోలేని అనురాగంతో ఇలా అన్నారు.