పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగుడు యూసరవి ల్లగుట

  •  
  •  
  •  

10.2-482-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఈ థఁ జదివిన వారలుఁ
గైకొని వినువారు విగత లుషాత్మకులై
లౌకికసౌఖ్యము నొందుదు
రా కైవల్యంబుఁ గరతలామలక మగున్.

టీకా:

ఈ = ఈ; కథన్ = వృత్తాంతమును; చదివిన = చదివిని; వారలున్ = వారు; కైకొని = పూని; విను = వినెడి; వారున్ = వారు; విగత = తొలగిన; కలుషా = పాపములు; ఆత్మకులు = కలవారు; ఐ = అయ్యి; లౌకిక = ఇహలోకపు; సౌఖ్యమున్ = సౌఖ్యములను; ఒందుదురు = పొందుతారు; ఆ = ఆ; కైవల్యంబున్ = మోక్షముకూడ; కరతలామలకము = సులువుగా లభించునది {కరత లామలకము - కరతల (అరచేతిలోని) అమలకము (ఉసరికాయ) వలె సులభముగ అందునది}; అగున్ = అగును.

భావము:

“ఈ కథను చదివినవారికీ, విన్నవారికీ, సర్వపాపాలు తొలగిపోతాయి. ఇహలోకంలో సౌఖ్యం ప్రాప్తిస్తుంది. పరలోకంలో మోక్షం సులభంగా లభిస్తుంది.