పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగోపాఖ్యానంబు

  •  
  •  
  •  

10.2-467-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఒండొక భూమీసురకుల
మంనునకు దాన మీయ సలక యా వి
ప్రుం డా గోవుంగొని చను
చుండన్ మును ధారగొన్న యుర్వీసురుఁడున్.

టీకా:

ఒండు = వేరు; ఒక = ఒక; భూమీసుర = బ్రాహ్మణ; కుల = వంశమున; మండనున్ = భూషణము వంటివాని; కున్ = కి; దానము = దానము; ఈయన్ = ఇవ్వగా; మసలక = ఆలస్యము చేయకుండా; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; ఆ = ఆ; గోవున్ = ఆవును; కొని = తీసుకొని; చనుచుండన్ = వెళుతుండగా; మును = మునుపు; ధారన్ = దానముగా; కొన్న = తీసుకొన్న; ఉర్వీసురుడున్ = విప్రుడు.

భావము:

అది తెలియని, నేను ఆ గోవును ఇంకొక బ్రాహ్మణోత్తమునకు దానముగా ఇచ్చాను. ఆ బ్రాహ్మణోత్తముడు ఆ ఆవును తోలుకుని వెళుతూంటే, ఇంతకు ముందు నాచే దానం పొందిన కశ్యపుడు ఆ గోవును చూసాడు