పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగోపాఖ్యానంబు

  •  
  •  
  •  

10.2-461-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిక్ష్వాకుతనూజుఁడన్ నృగుఁడు నా నేపారు భూపాలుఁడన్;
దీవ్రాతము నర్థిఁ బ్రోచుచు ధరిత్రీనాయకుల్‌ గొల్చి స
మ్మానింపం జతురంత భూభరణసార్థ్యుండనై సంతత
శ్రీ నిండారినవాఁడ నుల్లసిత కీర్తిస్ఫూర్తి శోభిల్లఁగన్.

టీకా:

ఏన్ = నేను; ఇక్ష్వాకు = ఇక్ష్వాకుని; తనూజుడన్ = కొడుకును; నృగుడు = నృగుడు; నాన్ = అనగా; ఏపారు = అతిశయించు; భూపాలుడన్ = రాజును; దీన = దీనుల; వ్రాతమున్ = సమూహమును; అర్థిన్ = ప్రీతితో; ప్రోచుచున్ = రక్షించుచు; ధరిత్రీనాయకుల్ = రాజులు; కొల్చి = సేవించి; సమ్మానింపన్ = గౌరవింపగా; చతుర = నాలుగు; అంత = చెరగుల మేరగల; భూ = భూమినంతటి; భరణ = ఏలునట్టి; సామర్థ్యుండను = సమర్థత కలవాడను; ఐ = అయ్యి; సంతత = ఎల్లప్పుడు; శ్రీ = కలిమి; నిండారిన = నిండుగా ఉన్న; వాడన్ = వాడను; ఉల్లసిత = ప్రకాశితమగు; కీర్తి = కీర్తి; స్ఫూర్తి = కనబడుట; శోభిల్లగన్ = ప్రకాశించుచుండగా.

భావము:

నేను ఇక్ష్వాకుని పుత్రుడను. నా పేరు నృగుడు. నేను రాజులు అనేకులు నన్ను సేవిస్తుండగా బహు సమర్థవంతంగా రాజ్యపాలన సాగించాను. దీనులను పోషించాను. పెంపొందిన అనంత కీర్తిసంపదలతో శోభించాను.