పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగోపాఖ్యానంబు

  •  
  •  
  •  

10.2-457-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

చూచి కృష్ణుం డతని వృత్తాంతం బంతయు నెఱింగియు నక్కడి జనంబులుం గుమారవర్గంబును దెలియుకొఱకు నతనిచేత తద్వృత్తాంతం బంతయు నెఱింగించువాఁడై యిట్లనియె.

టీకా:

చూచి = చూసి; కృష్ణుండు = కృష్ణుడు; అతనిన్ = అతని; వృత్తాంతంబున్ = విషయము; అంతయున్ = సమస్తము; ఎఱింగియున్ = తెలిసి ఉన్నను; అక్కడి = అక్కడ ఉన్న; జనంబులున్ = వారు; కుమార = కొడుకుల; వర్గంబును = సమూహము; తెలియు = తెలిసికొనుట; కొఱకున్ = కోసము; అతనిన్ = అతని; చేత = చేత; తత్ = అతని; వృత్తాంతంబున్ = వియము; ఎఱింగించువాడు = తెలియజేయువాడు; ఐ = అయ్యి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

అతనిని చూచి శ్రీకృష్ణుడు అతని వృత్తాంతం తనకు తెలిసినా కూడా, తన కుమారులకూ మిగిలిన జనాలకు తెలియడం కోసం. అతని కథను అతని చేతనే చెప్పించాలి అనుకుని అతనితో ఇలా అన్నాడు.