పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : నృగోపాఖ్యానంబు

  •  
  •  
  •  

10.2-455-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రువిడి పోయి తెచ్చి ఘనపాశచయంబుల నంటఁగట్టి య
గ్గురుభుజు లందఱుంగదిసి కోయని యార్చుచు దాని నెమ్మెయిం
లఁగఁ దీయలేక దగ ట్టముగా మది దుట్టగిల్ల నొం
డొరు గడవంగ వే చని పయోరుహనాభున కంతఁ జెప్పినన్.

టీకా:

పరువిడి = పరుగెత్తి; పోయి = వెళ్ళి; తెచ్చి = తీసుకు వచ్చి; ఘన = పెద్ధ; పాశచయంబున్ = తాళ్ళను; అంటగట్టి = గట్టిగా కట్టి; ఆ = ఆ; గురు = గొప్ప; భుజులు = బాహుబలము కలవారు; అందరున్ = అందరు; కదిసి = చేరి; కో = కో; అని = అని; ఆర్చుచున్ = కేకలు వేయుచు, బొబ్బలు పెట్టుతూ; దానిన్ = దానిని; నెఱి = నిండైన; మెయిన్ = శరీరమును; తరలగన్ = కదల్చి; తీయలేక = తీయలేక; దగ = తాపము, దాహము; దట్టము = అధికము; కాన్ = కాగా; మది = మనస్సు; తుట్టగిల్లన్ = తపింపగా; ఒండొరున్ = ఒకరి నొకరు మించి; వేన్ = వేగముగా, వడిగా; చని = వెళ్ళి; పయోరుహనాభున్ = కృష్ణున {పయోరుహ నాభుడు - పద్మము బొడ్డున గల వాడు, విష్ణువు}; కున్ = కు; అంతన్ = సమస్త వృత్తాంతమును; చెప్పినన్ = చెప్పగా.

భావము:

వారంతా పరుగు పరగున వెళ్ళి, పెద్ద పెద్ద తాళ్ళు తీసుకుని వచ్చారు. గొప్ప భుజబలం కల ఆ వీరులు ఆ ఊసరవెల్లిని బయటకు తీయడానికి ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. వారు వెంటనే వెళ్ళి శ్రీకృష్ణుడితో ఈ విషయం విన్నవించారు.