పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-47-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శౌరి కేమి తప్పు త్రాజితుఁడు సేసెఁ?
గూఁతు మణిని నేల కోరి యిచ్చె?
తని కెట్లు కలిగె నా శమంతకమణి
విప్రముఖ్య! నాకు విస్తరింపు. "

టీకా:

శౌరి = కృష్ణుడు {శౌరి - శూరుని మనుమడు, కృష్ణుడు}; కిన్ = కి; ఏమి = ఎడల; తప్పు = తప్పు; సత్రాజితుడు = సత్రాజిత్తు; చేసెన్ = చేసెను; కూతున్ = కూతురును; మణిని = శమంతకమణిని; ఏలన్ = ఎందుకు; కోరి = అపేక్షించి; ఇచ్చెన్ = ఇచ్చెను; అతని = అతని; కిన్ = కి; ఎట్లు = ఏ విధముగ; కలిగెన్ = లభించెను; ఆ = ఆ యొక్క; శమంతక = శమంతకము అను; మణి = రత్నము; విప్ర = బ్రాహ్మణులలో; ముఖ్య = ముఖ్యమైనవాడ; నా = నా; కున్ = కు; విస్తరింపు = వివరించి చెప్పుము.

భావము:

“ఓ మునీంద్రా! శ్రీకృష్ణుడిపట్ల సత్రాజిత్తు ఏమి అపరాధం చేసాడు. శమంతకమణినీ తన కూతురుని ఎందుకు కోరి కోరి ఇచ్చాడు. అతనికి శమంతకమణి ఎలా దొరికింది. ఈ విశేషాలన్నీ నాకు వివరంగా చెప్పండి.”