పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-42-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కొడుకుం జూచి సంతోషించి కోడలిగుణంబులు కైవారంబు సేసి, వినోదించుచుండె; నంత ద్వారకానగరంబు ప్రజలు విని హర్షించి; రందు.

టీకా:

అని = అని; కొడుకున్ = కొడుకునప; చూచి = చూచి; సంతోషించి = సంతోషించి; కోడలి = కోడలు (మాయాదేవి); గుణంబులు = సుగుణములను; కైవారంబు = శ్లాఘించుట; చేసి = చేసి; వినోదించుచుండన్ = ఆనందించుచుండగా; అంత = ఆ సమయము నందు; ద్వారకానగరంబు = ద్వారకానగరము; ప్రజలు = పురజనులు; విని = విని; హర్షించిరి = సంతోషించిరి; అందున్ = అప్పుడు.

భావము:

అంటూ రుక్మిణీదేవి తన కుమారుడిని చూసి ఎంతో ఆనందించింది. కోడలి సద్గుణాలను పొగుడుతూ, వేడుకలు చేయసాగింది. అంతట ఆ వార్త విని ద్వారకానగర వాసులు అందరూ ఎంతో సంతోషించారు.