పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-40-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యంతఃపుర కాంతలును, దేవకీవసుదేవ రామకృష్ణులును యథోచితక్రమంబున నా దంపతుల దివ్యాంబరాభరణాలంకృతుల సత్కరించి సంతోషించిరి; రుక్మిణీదేవియు నందనుం గౌఁగిలించు కొని.

టీకా:

అని = అని; అంతఃపుర = అంతఃపురమున ఉండు; కాంతలును = స్త్రీలు; దేవకీ = దేవకీదేవి; వసుదేవ = వసుదేవుడు; రామ = బలరాముడు; కృష్ణులును = కృష్ణుడు; యథోచిత = తగిన; క్రమంబునన్ = రీతిని; ఆ = ఆ; దంపతుల = భార్యాభర్తలను; దివ్య = దివ్యమైన; అంబర = బట్టలు; అభరణలు = భూషణములచేత; అలంకృతుల = అలంకారములచేత; సత్కరించి = సన్మానముచేసి; సంతోషించిరి = సంతోషించారు; రుక్మిణీదేవియు = రుక్మిణీదేవి; నందనున్ = కుమారుని; కౌగలించుకొని = కౌగలించుకొని;

భావము:

అని అనుకుంటూ అంతఃపుర కాంతలూ, దేవకీ వసుదేవులూ, బలరామ కృష్ణులూ మంచి మంచి వస్త్రాభరణాలతో రతీప్రద్యుమ్నులను సత్కరించి సంతోషించారు. రుక్మిణీదేవి తన కొడుకుని కౌగలించుకుని…