పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-37-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుఁ డని నొడువఁ దలఁచును;
యుఁడు గా కున్న మిగులఁ తిగొని సవతుల్‌
ను నగియెద రని తలఁచు; న
ను సంశయ మలమికొనఁగఁ నుమధ్య మదిన్.

టీకా:

తనయుడు = కొడుకు; అని = అని; నొడువన్ = చెప్పవలెనని; తలచును = అనుకొనును; తనయుడు = కొడుకు; కాక = కాకుండ; ఉన్నన్ = ఉన్నచో; మిగులన్ = మిక్కిలి; తతిగొని = సమయము కనిపెట్టి; సవతుల్ = సపత్నులు; తనున్ = తనను; నగియెదరు = పరిహాసము చేసెదరు; అని = అని; తలచును = అనుకొనును; అతను = ఆధికమైన, తక్కువకాని; సంశయము = సందేహము; అలమికొనగన్ = ఆవరించగా; తనుమధ్య = ఇంతి (రుక్మిణి); మదిన్ = మనసు నందు.

భావము:

రుక్మిణీదేవి ఇతడు తన కొడుకే అని చెప్పబోతుంది. కాని అతడు తన కుమారుడు కాకపోతే సమయం చిక్కిందని తన సవతులు తనను గేలిచేస్తారేమో అనే సంశయంతో ఆలోచించుకోసాగింది.