పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-31-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ళీ! నా తొలుచూలి పాపనికి బోర్కాడించి నే సూతికా
శాలామధ్య విశాలతల్పగత నై న్నిచ్చి నిద్రింప నా
బాలున్ నా చనుఁబాలకుం జెఱిచి యే పాపాత్ములే త్రోవ ము
న్నే లీలం గొనిపోయిరో? శిశువుఁ దా నే తల్లి రక్షించెనో!

టీకా:

ఆళీ = సఖీ; నా = నా యొక్క; తొలుచూలి = మొదటి కాన్పులో పుట్టిన; పాపని = బిడ్డడి; కిన్ = కి; బోర్కాడించి = స్నానము చేయించి; నేన్ = నేను; సూతికాశాలా = పురిటింటి; మధ్య = లోపలి; విశాల = పెద్ద; తల్ప = మంచము; గతను = పై ఉన్నదానిని; ఐ = అయ్యి; చన్నిచ్చి = స్తన్యము తాగించి; నిద్రింపన్ = నిద్రపోవుచుండగా; ఆ = ఆ; బాలున్ = పిల్లవానిని; నా = నా యొక్క; చనుబాలు = స్తన్యమున; కున్ = కు; చెఱచి = దూరముచేసి; ఏ = ఏ; పాపాత్ములు = పాపచిత్తులు; ఏ = ఏ; త్రోవన్ = మార్గమున; మున్ను = ఇంతకుముందు; ఏ = ఏ; లీలన్ = విధముగ; కొనిపోయిరో = తీసుకొనిపోయిరో; శిశువున్ = బాలుని; తాను = తాను; ఏ = ఏ; తల్లి = పుణ్యవతి; రక్షించెనో = పోషించెనో.

భావము:

ఓ చెలీ! నా తొలిచూలు బాలుడికి స్నానం చేయించి పురిటిగదిలో మంచంపై పడుకుని చన్నిచ్చి నిద్రపోతున్న సమయంలో, ఏ పాపాత్ములు నా పుత్రుడిని నా చనుబాలకు దూరంచేసి ఏవిధంగా దొంగిలించుకుని పోయారో? ఆ పిల్లవాడిని ఏ చల్లనితల్లి రక్షించిందో?