పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రతీ ప్రద్యుమ్ను లాగమనంబు

  •  
  •  
  •  

10.2-25-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మెఱుఁగుఁదీగెతోడి మేఘంబు కైవడి
యువిదతోడ మింటి నుండి కదలి
రుగుదెంచె మదనుఁ డంగనాజనములు
మెలఁగుచున్న లోనిమేడకడకు.

టీకా:

మెఱుగుతీగె = మెరుపుతీగె; తోడి = తోటి; మేఘంబు = మేఘము; కైవడిన్ = వలె; ఉవిద = స్త్రీ; తోడన్ = తోటి; మిన్ను = ఆకాశము; నుండి = నుంచి; కదలి = బయలుదేరి; అరుగుదెంచె = వచ్చెను; మదనుడు = ప్రద్యుమ్నుడు; అంగనాజనములు = అంతఃపురస్త్రీలు; మెలగుచున్న = తిరుగెడి; లోనిమేడ = అంతఃపురము మేడ; కడ = వద్ద; కున్ = కు.

భావము:

మాయాదేవితో కూడిన ప్రద్యుమ్నుడు మెఱుపుతీగతో కూడిన మేఘంలా శోభిస్తూ ఆకాశంలో నుండి దిగి స్త్రీలు నివసించే అంతఃపురం మేడ మీదకు చేరాడు.