పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివుడు కృష్ణుని స్తుతించుట

  •  
  •  
  •  

10.2-452-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని చెప్పిన శుకయోగికి
నాయకుఁ డనియెఁ గృష్ణరితము విన నా
మెపుడుఁ దనియ దింకను
వి వలతుం గరుణఁ జెప్పవే మునినాథా!"

టీకా:

అని = ఇట్లు; చెప్పిన = తెలియజెప్పిన; శుక = శుకుడు అను; యోగి = ఋషి; కిన్ = కి; జననాయకుడు = రాజు (పరీక్షిత్తు); అనియెన్ = చెప్పెను; కృష్ణ = కృష్ణుని; చరితము = వృత్తాంతములు; వినన్ = వినుట యందు; నా = నా యొక్క; మనము = మనస్సు; ఎపుడున్ = ఎప్పటికి; తనియదు = తృప్తిచెందదు; ఇంకను = ఇంకా; వినన్ = వినవలెనని; వలతున్ = కోరెదను; కరుణన్ = దయతో; చెప్పవే = చెప్పుము; ముని = మునులలో; నాథా = శ్రేష్ఠుడా.

భావము:

ఇలా పరీక్షిత్తుతో శుకయోగీంద్రుడు చెప్పాడు. పరీక్షిత్తు శుకుడితో “కృష్ణుని చరిత్ర వినడానికి మనస్సు ఇంకా ఉవ్విళ్ళూరుతున్నది. సంతృప్తి కలుగుట లేదు. దయచేసి, ఆ కథలను ఇంకా చెప్ప” మని ప్రార్థించాడు.