పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివుడు కృష్ణుని స్తుతించుట

  •  
  •  
  •  

10.2-448-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అం మురాంతకుండు త్రిపురాంతకు వీడ్కొని బాణు నిల్పి య
త్యంవిభూతిమై నిజబలావలితోఁ జనుదేర నా యుషా
కాంతుఁడు మున్నుగాఁ బటహ కాహళ తూర్య నినాద పూరితా
శాంరుఁడై వెసం జనియె నాత్మ పురీముఖుఁడై ముదంబునన్.

టీకా:

అతన్ = పిమ్మట; మురాంతకుండు = కృష్ణుడు; త్రిపురాంతకున్ = శివుని; వీడ్కొని = సెలవు తీసుకొని; బాణుని = బాణుని; నిల్పి = ఆపి; అత్యంత = మిక్కిలి; విభూతిమైన్ = వైభవముతో; నిజ = తన; బల = సైనిక; ఆవలి = సమూహము; తోన్ = తోటి; చనుదేరన్ = బయలుదేరగా; ఆ = ఆ; ఉషాకాంతుడు = అనిరుద్ధుడు; మున్నుగా = ముందువైపున ఉంచుకొని; పటహ = తప్పెటలు; కాహళ = బాకాలు; తూర్య = వాయిద్యాల; నినాద = మోతలతో; పూరిత = నిండిన; ఆశాంతరుడు = దిగ్భాగములు కలవాడు; ఐ = అయ్యి; వెసన్ = శీఘ్రముగా; చనియెన్ = వెళ్ళెను; ఆత్మ = తన; పురీ = నగరము; ముఖుండు = వైపు పోవువాడు; ఐ = అయ్యి; ముదంబునన్ = సంతోషముతో.

భావము:

ఆ తరువాత, మురాసురుని సంహరించిన కృష్ణుడు త్రిపురాసుర సంహారుడైన పరమ శివుని వద్ద సెలవు తీసుకుని, బాణాసురుడికి ఇక ఉండ మని చెప్పి. అత్యంత వైభవోపేతంగా పరివార సమేతుడై ఉషా అనిరుద్ధులను తీసుకుని పటహ, కాహాళ, తూర్యాదుల ధ్వనులు దిక్కులు పిక్కటిల్లేలా మ్రోగుతుండగా ద్వారకానగరానికి బయలుదేరాడు.