పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : మహేశ వైష్ణవ జ్వర ప్రకారంబు

  •  
  •  
  •  

10.2-435-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ని రణభూమిని మధ్యం
ది మార్తాండప్రచండ దీప్తాకృతితోఁ
రుచుఁ బరిపంథిబలేం
దవశిఖియైన కృష్ణుఁ దాఁకెం బెలుచన్.

టీకా:

చని = వెళ్ళి; రణభూమిని = యుద్ధభూమి నందు; మధ్యందిన = మధ్యాహ్న కాలము నందలి; మార్తాండ = సూర్యుని వలె; ప్రచండ = తీవ్రమైన; దీప్త = మండుతున్న; ఆకృతి = రూపము; తోన్ = తోటి; తనరుచున్ = అతిశయించుచు; పరిపంథి = శత్రు పక్షము యొక్క; బల = సైన్యము అను; ఇంధన = కట్టెలకు; దవశిఖి = దావాగ్ని; ఐన = అయిన; కృష్ణున్ = కృష్ణుని; తాకెన్ = ఎదుర్కొనెను; పెలుచన్ = ఆగ్రహముతో.

భావము:

బాణాసురుడు అలా కదలి వచ్చి కదనరంగంలో మధ్యాహ్న మార్తాండుని వలె ప్రకాశిస్తూ శత్రు సేనలు అనే కట్టెలకు అగ్నిజ్వాలల వలె విరాజిల్లే శ్రీకృష్ణుడిని ఎదుర్కొన్నాడు.