పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-422-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ప్రళయ జీమూత సంఘాత యద భూరి
భైరవారావముగ నొత్తెఁ బాంచజన్య
ఖిలజనులు భయభ్రాంతుయి చలింపఁ
డఁగి నిర్భిన్న రాక్షసీర్భముగను.

టీకా:

ప్రళయ = ప్రళయకాలపు; జీమూత = మేఘముల; సంఘాత = సమూహమువలె; భయద = భయమును కలిగించెడి; భూరి = మిక్కిల అధికమైన; భైరవ = భీకరమైన; ఆరావము = ధ్వని; కను = కలుగునట్లు; ఒత్తెన్ = ఊదెను; పాంచజన్యమున్ = పాంచజన్యమను శంఖము {పాంచజన్యము - విష్ణుమూర్తి శంఖము}; అఖిల = ఎల్ల; జనులు = వారు; భయ = భయముచేత; భ్రాంతులు = తత్తరిల్లినవారు; అయి = అయ్యి; చలింపన్ = తడబడగా; కడగి = పూని; నిర్భిన్న = విచ్ఛిన్నమైన; రాక్షసీ = రాక్షస స్త్రీల; గర్భము = గర్భములు; కన్ = కలుగునట్లు.

భావము:

అలా చేసిన శ్రీకృష్ణుడు, ప్రళయకాలం నాటి మేఘగర్జనం అంత గట్టిగా తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు. ఆ శంఖారావం వినిన సమస్త జనులు భయభ్రాంతులు అయ్యారు. రాక్షస స్త్రీల గర్భాలు భేదిల్లాయి.