పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-414-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు వ్రాలినం జక్రపాణి పరబలంబుల నిశితబాణ పరంపరలం దునిమియు, నొక్కయెడం గృపాణంబులం గణికలు సేసియు, నొక్కచో గదాహతులం దుత్తుమురుగా మొత్తియు నివ్విధంబునఁ బీనుంగుపెంటలఁ గావించె; నంత.

టీకా:

ఇట్లు = ఇలా; వ్రాలినన్ = వాలిపోగా; చక్రపాణి = కృష్ణుడు {చక్రపాణి – చక్రము చేత గలవాడు, కృష్ణుడు}; పర = శత్రువుల; బలంబులన్ = సైన్యములను; నిశిత = వాడియైన; బాణ = బాణముల; పరంపరలన్ = వరుసలచేత; తునిమియున్ = ఖండించి; ఒక్క = ఒకానొక; ఎడన్ = చోట; కృపాణంబులన్ = కత్తుల; కణికలు = తునకలుగా;తో చేసియున్ = చేసి; ఒక్క = ఒకానొక; చోన్ = చోట; గదా = గద; హతులన్ = మోదుటలచేత; తుత్తురుముగా = నుగ్గునుగ్గుగా; మొత్తియున్ = మొత్తి; ఈ = ఈ; విధంబునన్ = విధముగా; పీనుగపెంటలన్ = శవాల గుట్టలు గుట్టలుగా; కావించెన్ = చేసెను; అంత = పిమ్మట;

భావము:

శూలపాణి స్పృహ తప్పుట చూసి, చక్రధారి అయిన కృష్ణుడు శత్రుసైన్యాన్ని శరపరంపరలతో చిందరవందర చేసాడు. కొందరిని గదాఘాతాలతో తుత్తుమురు చేసాడు. ఈవిధంగా శత్రుసైన్యాన్ని హతమార్చాడు.