పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : శివ కృష్ణులకు యుద్ధ మగుట

  •  
  •  
  •  

10.2-413-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జృంణశరపాతముచే
శంభుఁడు నిజతనువు పరవశం బయి సోలన్
జృంభితుఁడై ఘననిద్రా
రంత వృషభేంద్రు మూఁపుముపై వ్రాలెన్.

టీకా:

జృంభణశర = సమ్మోహనాస్త్రము యొక్క; పాతము = పాటు; చేతన్ = చేత; శంభుడు = శివుడు {శంభుడు - సుఖమును కలిగించువాడు, శివుడు}; నిజ = తన; తనువు = దేహము; పరవశంబు = స్వాధీనత తప్పినది; అయి = ఐ; సోలన్ = తెలివి తప్పిపోగా; జృంభితుడు = ఆవులించువాడు; ఐ = అయ్యి; ఘన = గాఢమైన; నిద్రా = నిద్రించుట; ఆరంభతన్ = మొదలిడుటచేత; వృషభేంద్రు = నంది; మూపురము = మూపురము; పైన్ = మీద; వ్రాలెన్ = వాలెను.

భావము:

ఆ సమ్మోహనాస్త్రం యొక్క ప్రభావం వలన శరీరం స్వాధీనం తప్పి, శంకరుడు నందీశ్వరుని మూపురంపైకి వ్రాలిపోయాడు.