పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : చిత్రరేఖ పటంబున చూపుట

  •  
  •  
  •  

10.2-361-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నితారత్నము కృష్ణనందనుని భాప్రౌఢిఁ దాఁ జూచి గ్ర
ద్దనఁ దన్నర్థి వరించి చన్న సుగుణోత్తంసంబ కా నాత్మలో
నుమానించి యనంతరంబ యనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూ
చేతోభవమూర్తిఁ జూచి మది సంతాపించుచున్నిట్లనున్.

టీకా:

వనితా = స్త్రీలలో; రత్నము = ఉత్తమురాలు; కృష్ణనందునుని = ప్రద్యుమ్నుని; భావ = మనోవికారము యొక్క; ప్రౌఢిన్ = ఎచ్చరికతో; తాన్ = ఆమె; చూచి = చూసి; గ్రద్ధనన్ = తటాలున; తన్ను = తనను; అర్థిన్ = ప్రీతితో; వరించి = కోరి కలసి; చన్న = వెళ్ళిపోయిన; సుగుణ = సద్గుణ; ఉత్తంసంబ = శిరోమణి; కాన్ = ఐయినట్లు; ఆత్మ = మనసు; లోన్ = అందు; అనుమానించి = సందేహించి; అనంతరంబ = అటు పిమ్మట; ఆ = ఆ ప్రసిద్ధుడైన; అనిరుద్ధ = అనిరుద్ధుడు అను; ఆఖ్యున్ = పేరు కలవానిని; సరోజాక్షున్ = పద్మాక్షుని; నూతన = నవ; చేతోభవ = మన్మథుని వంటి; మూర్తిన్ = ఆకారము కలవానిని; చూచి = చూసి; మదిన్ = మనసు నందు; సంతాపించుచున్ = మిక్కిలి తపించుచు; ఇట్లు = ఈ విధముగ; అనున్ = పలికెను.

భావము:

ఆ బాలామణి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించినవాడు ఇతడే అని అనుమానించింది. కాని పిమ్మట చిత్రరేఖ చూపించిన పద్మనేత్రుడూ, నవమన్మథాకారుడూ అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా పలికింది.