పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : చిత్రరేఖ పటంబున చూపుట

  •  
  •  
  •  

10.2-356-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు సకలదేశాధీశ్వరులగు రాజవరుల నెల్లఁ జూపుచు యదువంశసంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులం జూపి మఱియును.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; సకల = ఎల్ల; దేశాధీశ్వరులు = రాజులు; అగు = ఐన; రాజ = రాజ; వరులన్ = శ్రేష్ఠులను; ఎల్లన్ = అందరిని; చూపుచున్ = చూపించుచు; యదువంశ = యాదవ వంశమున; సంభవులు = పుట్టినవారు; ఐన = అయినట్టి; శూరసేన = శూరసేనుడు; వసుదేవ = వసుదేవుడు; ఉద్ధవ = ఉద్ధవుడు; ఆదులన్ = మున్నగువారిని; చూపి = చూపించి; మఱియును = ఇంకను.

భావము:

ఈ విధంగా ఉషాబాలకు సమస్త రాజులను చూపిస్తూ చిత్రరేఖ, యాదవవంశస్థులైన శూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైనవారిని కూడా చూపించింది.