పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : బాణున కీశ్వర ప్రసాద లబ్ధి

  •  
  •  
  •  

10.2-326-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన నట్లు సంప్రాప్తమనోరథుండై నిజభుజవినాశకార్య ధురీణుం డగు బాణుండు సంతుష్టాంతరంగుం డగుచు నిజనివాసంబు నకుం జని, తన ప్రాణవల్లభల యుల్లంబులు పల్లవింపఁ జేయుచు నిజధ్వజనిపాతంబు నిరీక్షించుచుండె, తదనంతరంబ.

టీకా:

అని = అని; పలికినన్ = చెప్పగా; అట్లు = ఆ విధముగ; సంప్రాప్త = లభించిన; మనోరథుండు = కోరిక కలవాడు; ఐ = అయ్యి; నిజ = తన; భుజ = చేతులు; నాశ = నశించెడి; కార్య = పనిని; ధురీణుండు = పూనిన వాడు; అగు = ఐన; బాణుండు = బాణాసురుడు; సంతుష్ట = తృప్తిచెందిన; అంతరంగుడు = మనసు కలవాడు; అగుచున్ = ఔతు; నిజ = తన; నివాసంబు = గృహమున; కున్ = కు; చని = వెళ్ళి; తన = తన యొక్క; ప్రాణవల్లభల = భార్యల; ఉల్లంబులున్ = మనసులు; పల్లవింప = చిగురింప; చేయుచున్ = చేయుచు; నిజ = తన; ధ్వజ = జండాకఱ్ఱ; నిపాతంబున్ = పడిపోవుటను; నిరీక్షించుచుండెన్ = ఎదురుచూచు చుండెను; తదనంతరంబ = అటుపిమ్మట.

భావము:

ఆ పరమేశ్వరుని పలుకులు విని బాణాసురుడు తన కోరిక తీరబోతున్నందుకు చాలా సంతోషించాడు. తన సౌధానికి వెళ్ళిపోయాడు. తన ప్రియురాండ్రతో కూడి ఆనంద డోలికలలో తూగుతూ, ఎప్పుడు తన రథం మీది జండాకొయ్య నేలకొరుగుతుందా అని ఎదురుచూడసాగాడు. అటుపిమ్మట...