పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-309-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అందు వసించిరి నందిత
చంన మందార కుంద చంద్ర లసన్మా
కంముల నీడ హృదయా
నంము సంధిల్ల నందనందనముఖ్యుల్‌.

టీకా:

అందున్ = దానిలో; వసించిరి = ఉన్నారు; నందిత = కొనియాడబడిన; చందన = మంచిగంధము చెట్లు; మందార = మందార చెట్లు; కుంద = మొల్ల మొక్కలు; చంద్ర = కర్పూరపు చెట్లు; లసత్ = ప్రకాశించుచున్న; మాకందముల = తియ్య మామిడి చెట్లు యొక్క; నీడన్ = నీడలో; హృదయ = మనస్సునకు; ఆనందము = ఆనందము; సంధిల్లన్ = కలుగగా; నందనందన = కృష్ణుడు; ముఖ్యుల్ = మొదలగువారు.

భావము:

అలా చందనవృక్షాలు మందారాలు మంచి మామిళ్ళు మొదలైన అనేక వృక్షాలతో శోభిస్తున్న ఆ కుశస్థలి పట్టణం సమీపంలోని ఉద్యానవనం చేరి విడిసారు. అక్కడ కృష్ణాదులు చందన మందారాది ఉద్యానవన వృక్షాల నీడలలో ఆనందంగా విశ్రమించారు.