పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-307-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మంళతూర్యఘోషము లమందగతిం జెలఁగంగ మత్త మా
తం తురంగ సద్భట కదంబముతోఁ జని కాంచి రంత నా
రం లవంగ లుంగ విచన్మదభృంగ సురంగనాద స
త్సం తరంగిణీకలిత సంతతనిర్మల నా కుశస్థలిన్.

టీకా:

మంగళ = శుభసూచకమైన; తూర్య = వాద్యముల; ఘోషములు = ధ్వనులు; అమందగతిన్ = బిగ్గరగా; చెలగంగన్ = చెలరేగుతుండగా; మత్త = మదించిన; మాతంగ = ఏనుగుల; తురంగ = గుఱ్ఱముల; సద్భట = సైనికుల; కదంబము = సముదాయము; తోన్ = తోటి; చని = వెళ్ళి; కాంచిరి = చూసిరి; అంతన్ = అంతట; నారంగ = నారదబ్బ, నారింజ; లవంగ = లవంగము; లుంగ = మాదీఫలములు అందు; విచరిత్ = కలియ తిరుగుతున్న; మద = మదించిన; భృంగ = తుమ్మెదల యొక్క; సురంగ = మనోజ్ఞమైన; నాద = ధ్వనులుతో; సత్ = మంచిగా; సంగన్ = కూడినదానిని; తరంగిణీ = సెలయేళ్ళ యందు; కలితన్ = కూడుకొన్నదానిని; సంతత = ఎడతెగని; నిర్మలన్ = స్వచ్ఛత గలదానిని; ఆ = ఆ యొక్క; కుశస్థలిన్ = కుశస్థలి అను ప్రదేశమును.

భావము:

మంగళవాద్య ధ్వనులు మ్రోగుతుండగా; మదగజ, తురగ, రథ, సుభటులతో కూడిన చతురంగబలాలతో బయలుదేరి, వికసించిన నానావిధ వృక్షాలతో ఝుంకారంచేసే తుమ్మెదలతో స్వచ్ఛమైన తరంగాలతో ఎడతెగక పారే నదులతో కూడిన కుశలమైన ప్రాంతం కావున కుశస్థలి అని పేరుపొందిన ద్వారకానగరం చేరారు.