పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మి బలరాముల జూదంబు

  •  
  •  
  •  

10.2-302-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అంతం బోవక రుక్మిని
దంతంబులు మున్ను డులిచి ను వగలింప
న్నంకుపురి కేగెను వాఁ
డెంయు భయ మంది రాజు లెల్లం గలఁగన్.

టీకా:

అంతన్ = దానితో; పోవక = వదలిపెట్టకుండ; రుక్మినిన్ = రుక్మిని; దంతంబులున్ = పండ్లు; మున్ను = ముందుగా; డులిచి = రాలగొట్టి; తనువు = దేహము; అగలింపన్ = నొప్పించగా; అంతకపురికేగెను = చచ్చిపోయెను {అంతక పురి కేగు - అంతక (యముని) పురి (నగరమునకు) ఏగు (వెళ్ళు), మరణించు}; వాడు = అతడు; ఎంతయున్ = మిక్కిలి; భయమున్ = భీతిని; అంది = పొంది; రాజులు = రాజులు; ఎల్లన్ = అందరు; కలగన్ = కలతచెందగా.

భావము:

బలభద్రుడు అంతటితో ఊరుకోకుండా రాజులంతా భయపడేలా రుక్మి పండ్లు పగుల గొట్టి, గట్టిగా కొట్టాడు. దానితో వాడు మరణించాడు.