పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కృష్ణ కుమా రోత్పత్తి

  •  
  •  
  •  

10.2-276-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఘ! పదాఱువేల సతులందు జనించిరి వేఱువేఱ నం
దశకంబు తత్సుత వితానము గాంచి రనేక సూనుల
న్నెయఁగ నిట్లు పిల్లచెఱ కీనిన కైవడిఁ బుత్త్ర పౌత్త్ర వ
ర్ధమున నొప్పెఁ గృష్ణుఁడు ముదంబునఁ దామరతంపరై భువిన్.

టీకా:

అనఘ = పుణ్యా, పరీక్షిన్మహారాజా; పదాఱువేల = పదహారువేల (16000); సతులు = భార్యలు; అందున్ = అందు; జనించిరి = పుట్టిరి; వేఱువేఱ = విడివిడిగా; నందన = పుత్రుల; దశకంబున్ = పదేసిమంది; తత్ = ఆ; సుత = కొడుకుల; వితానమున్ = సమూహము; కాంచిరి = పొందిరి; అనేత = పెక్కుమంది; సూనులన్ = కుమారులను; ఎనయంగన్ = పొందికగా; ఇట్లు = ఈ విధముగ; పిల్లచెఱుకు = చెరుకునకు పిలకలు; ఈనిన = పుట్టిన; కైవడిన్ = విధముగా; పుత్ర = కొడుకులు; పౌత్ర = మనుమలు; వర్ధనమునన్ = వృద్ధిచెందుటచేత; ఒప్పెన్ = ఒప్పి యుండెను; ముదంబునన్ = సంతోషముతో; తామరతంపర = తామరతీగ లల్లకొన్నట్లు; భువిన్ = భూలోకము నందు.

భావము:

శ్రీకృష్ణుడికి పదహారువేలమంది భార్యలలో ఒక్కొక్కరికి పదిమంది వంతున పుత్రులు ఉద్భవించారు ఆ పుత్రులు అందరికీ మళ్ళీ కుమారులు కలిగారు. ఈ విధంగా పిల్లచెఱకుకు పిలకలు పుట్టినట్లు తామరతంపరగా విలసిల్లిన పుత్రపౌత్రులతో శ్రీకృష్ణుడు శోభించాడు.