పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణీదేవి నూరడించుట

  •  
  •  
  •  

10.2-269-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అని యిట్లు కృష్ణుఁ డాడిన
వియ వివేకానులాప వితతామృత సే
ముదిత హృదయయై య
వ్వనితామణి వికచ వదన నరుహ యగుచున్.

టీకా:

అని = అని; ఇట్లు = ఇలా; కృష్ణుడు = కృష్ణుడు; ఆడిన = పలికిన; వినయ = మిక్కిలి మృదువైన; వివేక = వివేకవంతము లైన; అనులాప = ముచ్చట్లు అను; వితతా = విశేషమైన; అమృత = అమృతముచేత; సేచన = తడుపబడుటతో, చల్లుటచేత {సేచన - నైష్ఠిక కర్మలలో మంత్రోదకాన్ని చిలకరించుట, చల్లుట, తడుపుట, ఇది ప్రోక్షణ, అవోక్షణ, అభ్యుక్షణ అని మూడు విధములు}; ముదిత = సంతోషించిన; హృదయ = మనసు కలామె; ఐ = అయ్యి; ఆ = ఆ ప్రసిద్ధమైన; వనితా = స్త్రీలలో; మణి = శ్రేష్ఠురాలు; వికచ = వికసించిన; వదన = మోము అనెడి; వనరుహ = పద్మము కలామె {వనరుహము - వనము (నీరు) అందు పుట్టినది, పద్మము}; అగుచున్ = ఔతు.

భావము:

“ఈ విధంగా శ్రీకృష్ణుడు ఇంపుగా, ఊరడింపుగా, వినసొంపుగా పలికాడు. ఆ అమృతధారల వంటి ముచ్చట పలుకుల జల్లులకు రుక్మిణీదేవి మనసు సంతోషించింది; ముఖారవిందం సంతోషంతో వికసించింది.