పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణీదేవి నూరడించుట

  •  
  •  
  •  

10.2-267-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీవు పతివ్రతామణివి నిర్మల ధర్మవివేక శీల స
ద్భావు నీ మనోగతులఁ బాయక యెప్పుడు నస్మదీయ సం
సేయ కాని యన్యము భజింపవు; పుట్టిన నాఁటనుండి నీ
భా మెఱింగి యుండియును ల్కిన తప్పు సహింపు మానినీ!

టీకా:

నీవు = నీవు; పతివ్రతా = పతివ్రతలలో {పతివ్రత - పతిని సేవించుటే వ్రతముగా కలామె}; మణివి = ఉత్తమురాలవు; నిర్మల = పరిశుద్ధమైన; ధర్మ = ధర్మవర్తన చేసెడి; వివేక = తెలివి కల; శీల = నడవడిక కల; సత్ = మంచి; భావవు = స్వభావము కలామెవు; నీ = నీ యొక్క; మనోగతులన్ = ఆలోచనాసరళిని; పాయక = విడువక; ఎప్పుడున్ = ఎల్లప్పుడు; అస్మదీయ = నా యొక్క; సంసేవయ = చక్కటి సేవ మాత్రమే; కాని = తప్పించి; అన్యమున్ = ఇతరమును; భజింపవు = సేవించవు; పుట్టిన = జన్మించిన; నాటి = అప్పటి; నుండి = నుండి; నీ = నీ యొక్క; భావమున్ = స్వభావమును; ఎఱింగి = తెలిసి; ఉండియున్ = ఉండి కూడ; పల్కిన = అనిన; తప్పున్ = పొరపాటును; సహింపు = ఓర్చుకొనుము; మానినీ = రుక్మిణీదేవి {మానిని - మానము గలామె, స్త్రీ}.

భావము:

“దేవీ! రుక్మిణీ! నీవు మహాపతివ్రతవు, సౌశీల్యవతివి నా సేవ తప్ప నీకు బాల్యంనుండి ఇతర ఆలోచనలు లేవు. ఇదంతా తెలిసినప్పటికీ, నిన్ను బాధపెట్టాను. తప్పే. నన్ను మన్నించు.