పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణిదేవి స్తుతించుట

  •  
  •  
  •  

10.2-259-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీనాథులు దమతమ
వనితామందిరముల సియించుచు గో
మార్జాలంబుల గతి
స్థిబద్ధు లగుదురు నిన్నుఁ దెలియని కతనన్.

టీకా:

ధరణీనాథులున్ = రాజులు; తమతమ = వారివారి; వర = వరించిన; వనితా = స్త్రీల; మందిరములన్ = ఇండ్లలో; వసియించుచున్ = కాపురముంటు; గో = వృషభముల {గోగతి - ఎడతెగని కృషి క్రియలచేత వృషభముల వలె}; ఖర = గాడిదల {ఖరగతి - కేవల భారవాహక కృత్యములచేత గాడిదలవలె}; మార్జాలంబుల = పిల్లుల {మార్జాల గతి - ఎప్పుడు ఏమగునో అను భీతిచేత పిల్లివలె}; గతిన్ = వలె; స్థిర = దిట్టముగా; బద్ధులు = కట్టబడినవారు (మోహ పాశముల చేత); అగుదురు = ఔతారు; నిన్నున్ = నిన్ను; తెలియని = తెలిసికొనని; కతనన్ = కారణముచేత.

భావము:

సర్వేశ్వరుడిని నిన్ను గుర్తించ లేని రాజులు తమ ప్రేయసీ మందిరాలలో నివసిస్తూ పశువులు లాగా, గాడిదలు లాగ, పిల్లులు లాగ స్థిరంగా బంధింపబడుతూ ఉంటారు.