పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : రుక్మిణిదేవి స్తుతించుట

  •  
  •  
  •  

10.2-252-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నిను వరియించినం బెలుచ నీరజలోచన! శార్‌ఙ్గ సాయకా
నినదంబులన్ సకల త్రుధరాపతులన్ జయించి బో
పశుకోటిఁ దోలు మృగరాజు నిజాంశము భూరిశక్తిఁ గై
కొనిన విధంబునన్ నను నకుంఠిత శూరతఁ దెచ్చి తీశ్వరా!

టీకా:

నినున్ = నిన్ను; వరియించినన్ = కోరగా; పెలుచన్ = అతిశయముతో; నీరజలోచన = పద్మాక్షా, కృష్ణా; శార్ఙ్గ = శార్ఙ్గము అను; సాయకాసన = ధనుస్సు యొక్క; నినదంబులన్ = శబ్దములచేత; సకల = సర్వ; శత్రు = విరోధి; ధరాపతులన్ = రాజులను; జయించి = గెలిచి; బోరన = శీఘ్రముగా; పశు = జంతువుల; కోటిన్ = అన్నిటిని; తోలు = తరిమెడి; మృగరాజు = సింహము; నిజ = తన; అంశమున్ = వాటా (అమిషము); భూరి = అధికమైన; శక్తిన్ = బలముతో; కైకొనిన = తీసికొనిన; విధంబునన్ = రీతిని; ననున్ = నన్ను; అకుంఠిత = మొక్కపోని; శూరతన్ = పరాక్రమముతో; తెచ్చితి = తీసికొని వచ్చితివి; ఈశ్వరా = ప్రభు, కృష్ణా.

భావము:

ఓ నీరజలోచనా! మహాప్రభూ! నిన్నే అమితంగా వరించాను. ఆనాడు శార్ఙ్గ మనే నీ ధనుస్సు చేసిన టంకారంతో, సమస్త శత్రురాజులను జయించి మృగరాజు మృగాలను పారద్రోలి తన భాగాన్ని గ్రహించినట్లు, అసమాన శూరత్వంతో నీ దానను అయిన నన్ను పరిగ్రహించావు.