పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పదాఱువేల కన్యల పరిణయం

  •  
  •  
  •  

10.2-224-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న్నే పాయఁడు; రాత్రులన్ దివములన్ న్నే కృపం జెందెడిన్;
న్నే దొడ్డగఁ జూచు వల్లభలలో నాథుండు నా యింటనే
యున్నా డంచుఁ బదాఱువేలుఁ దమలో నూహించి సేవించి రా
న్నుల్‌ గాఢ పతివ్రతాత్వ పరిచర్యా భక్తియోగంబులన్.

టీకా:

నన్నే = నన్ను మాత్రమే; పాయడు = ఎడబాయడు; రాత్రులన్ = రాత్రివేళ లందు; దివములన్ = పగటివేళ లందు; నన్నే = నన్ను మాత్రమే; కృపన్ = దయతో; చెందెడిన్ = పొంది ఉండును; నన్నే = నన్ను మాత్రమే; దొడ్డగన్ = గొప్పగా; చూచున్ = చూస్తాడు; వల్లభలలోన్ = భార్యలలో; నాథుండు = పెనిమిటి; నా = నా; ఇంటనే = ఇంటిలోనే; ఉన్నాడు = ఉన్నాడు; అంచున్ = అనుచు; పదాఱువేలున్ = పదహారువేలమంది (16000); తమలో = తమ మనసులలో; ఊహించి = తలచి; సేవించిరి = కొలిచిరి; ఆ = ఆ; అన్నుల్ = స్త్రీలు; గాఢ = దట్టమైన; పతివ్రతాత్వ = పతివ్రతాభావముతో; పరిచర్యా = పూజించు; భక్తి = సేవించు; యోగంబులన్ = యోగములతో.

భావము:

“శ్రీకృష్ణుడు రాత్రింబవళ్ళు నాచెంతనే ఉంటూ నన్నే ప్రేమిస్తున్నా”డని తమలో తాము సంబరపడుతూ, ఆ పదహారువేలమంది పడతులు గొప్ప భక్తి భావంతో, పాతివ్రత్యంతో యదువల్లభుడిని ఆదరాభిమానములతో ఆరాధించారు