పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : పదాఱువేల కన్యల పరిణయం

  •  
  •  
  •  

10.2-221-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రుణులు బెక్కం డ్రయినను
బురుషుఁడు మనలేఁడు సవతి పోరాటమునన్,
రి యా పదాఱువేవురు
రుణులతో సమత మనియె క్షత్వమునన్.

టీకా:

తరుణులు = భార్యలు; పెక్కండ్రు = ఎక్కువమంది; అయినను = అయినచో; పురుషుడు = పెనిమిటి; మనలేడు = బతకలేడు; సవతి = సవతుల మధ్యని; పోరాటమునన్ = కలహముల వలన; హరి = కృష్ణుడు; ఆ = ఆ; పదాఱువేవురు = పదహారువేలమంది (16000); తరుణులు = స్త్రీల; తోన్ = తోటి; సమతన్ = సమత్వముతో; మనియె = జీవించెను; దక్షత్వమునన్ = సమర్థతతో.

భావము:

లోకంలో పురుషుడికి ఎక్కువ మంది భార్యలు ఉంటే సవతి పోరాటాలతో జీవించలేక సతమత మైపోతాడు. కానీ, శ్రీకృష్ణుడు పదహారువేలమంది తరుణుల పట్ల సరి సమాన భావాన్ని ప్రదర్శిస్తూ తన సామర్ధ్యంతో సుఖంగా జీవించాడు.