పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : కన్యలం బదాఱువేలం దెచ్చుట

  •  
  •  
  •  

10.2-206-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రాకులావతంసుఁడు పరాజిత కంసుఁడు సొచ్చి కాంచె ఘో
రాజుల రాజులం బటుశరాహతి నొంచి ధరాతనూజుఁ డు
త్తేజిత శక్తిఁ దొల్లిఁ జెఱదెచ్చినవారిఁ బదాఱువేల ధా
త్రీన మాన్యలన్ గుణవతీ వ్రతధన్యల రాజకన్యలన్.

టీకా:

రాజకులావతంసుడు = కృష్ణుడు {రాజ కులావతంసుడు - రాజ (చంద్ర) కులా (వంశమున) అవతంసుడు (సిగబంతివలె శ్రేష్ఠుడు), కృష్ణుడు}; పరాజితకంసుఁడు = కృష్ణుడు {పరాజిత కంసుఁడు - ఓడింపబడిన కంసుడు కలవాడు, కృష్ణుడు}; చొచ్చి = ప్రవేశించి; కాంచెన్ = చూసెను; ఘోర = భీకరమైన; ఆజులన్ = యుద్ధము లందు; రాజులన్ = రాజు లనేక మందిని; పటు = బలమైన; శరా = బాణముల; హతి = దెబ్బలతో; నొంచి = నొప్పించి; ధరాతనూజుడు = నరకాసురుడు; ఉత్తేజిత = మిక్కిల తేజరిల్లుతున్న; శక్తిన్ = శక్తితో; తొల్లి = మునుపు; చెఱన్ = చెరపట్టి; తెచ్చిన = తీసుకువచ్చిన; వారిన్ = వారిని; పదాఱువేలన్ = పదహారువేల (16000) మందిని; ధాత్రీజన = భూజనులచేత; మాన్యలన్ = గౌరవింపబడువారిని; గుణవతీ = సుగుణవతుల; వ్రత = వ్రతములచే, నడవడికతో; ధన్యలన్ = కృతార్థులను; రాజకన్యలన్ = రాకుమారిలను.

భావము:

కంసారి, యదుకులావతంసుడు అయిన శ్రీకృష్ణుడు ఆ రాజసౌధంలో, ఘోరమైన యుద్ధాలలో భూదేవి కొడుకు నరకుడు రాజులను శర పరంపరలతో ఓడించి, చెరపట్టి తెచ్చిన మాననీయులూ, గుణవతులూ అయిన పదహారువేలమంది రాజకన్యలను చూసాడు.