పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

దశమ స్కంధము - ఉత్తర : భద్ర లక్షణల పరిణయంబు

  •  
  •  
  •  

10.2-148-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు హరికి రుక్మిణియు, జాంబవతియు, సత్యభామయుఁ, గాళిందియు, మిత్రవిందయు, నాగ్నజితియు, భద్రయు, మద్ర రాజనందనయైన లక్షణయు ననంగ నెనమండ్రు భార్య లైరి; మఱియు నరకాసురుని వధియించి తన్నిరుద్ధకన్యల షోడశసహస్ర కన్యల రోహిణి మొదలైనవారిం బరిగ్రహించె” నన విని.
^ శ్రీకృష్ణుని అష్టమహిషలు

టీకా:

ఇట్లు = ఈ విధముగా; హరి = కృష్ణుని; కిన్ = కి; రుక్మిణియున్ = రుక్మిణి; జాంబవతియున్ = జాంబవతి; సత్యభామయున్ = సత్యభామ; కాళిందియున్ = కాళింది; మిత్రవిందయున్ = మిత్రవింద; నాగ్నజిత్తియున్ = నాగ్నజిత్తి; భద్రయున్ = భద్ర; మద్ర = మద్రదేశపు; రాజనందన = రాకుమారి; ఐన = అగు; లక్షణయున్ = లక్షణ; అనన్ = అనెడి; ఎనమండ్రు = ఎనిమిదిమంది (8); భార్యలు = భార్యలు; ఐరి = అయ్యారు; మఱియున్ = ఇంకను; నరక = నరకుడను; అసురుని = రాక్షసుని; వధియించి = సంహరించి; తత్ = అతనిచే; నిరుద్ధ = చెరపెట్టబడిన; కన్యలన్ = స్త్రీలను; షోడశసహస్ర = పదహారువేలమంది (16000); కన్యలన్ = యువతులను; రోహిణి = రోహిణి; మొదలైన = మున్నగు; వారిన్ = వారిని; పరిగ్రహించెను = చేపట్టెను; అని = అనగా; విని = విని.

భావము:

ఈవిధంగా శ్రీకృష్ణుడికి రుక్మిణి, జాంబవతి, సత్యభామ, కాళింది, మిత్రవింద, నాగ్నజితి, భద్ర, లక్షణ అనే వారు అష్టభార్యలు అయ్యారు. అంతేకాక నరకాసురుని సంహరించి అతని చెరలో నున్న రోహిణి మొదలైన పదహారువేలమంది కన్యకామణులను పరిగ్రహించాడు.” అని చెప్పగా పరీక్షుత్తు విని ఇలా అన్నాడు.